About the Book
హిమాలయ రహస్యాలు
ప్రతి సంవత్సరం ఈశా మెడిటేటర్సు కొందరు హిమాలయ యాత్రకు బయలుదేరతారు. సమకాలీన ప్రపంచంలో అతి ప్రముఖ గురువుగా అనేక
మందిచే కొనియాడ బడుచున్న జ్ఞాని, సద్గురు జగ్గి వాసుదేవ్ వారితో ప్రయాణం చేసేవారు.
వారితో ప్రయాణం చేయలేకపోయిన వారికి ఈ పుస్తకం. ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఆ ప్రయాణాన్ని సద్గురు మాటల ద్వారా ప్రయాణం
చేయడానికే ఆ పుస్తకం. ఆయన బోధనలు, సంబాషణల కలబోత ఈ పుస్తకం.
ఈ పుస్తకం కేవలం హిమాలయాల గురించే కాదు, అదే సమయంలో హిమాలయాలు లేకుండా ఈ పుస్తకం ఉండేది కాదు. ఈ పర్వతాలు ఒక
అంశంగా, ఒక విషయంగా, ఈ పుస్తకంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అవి లేకుండా ఈ పుస్తకంలోని కొన్ని ప్రశ్నలు అసలు అడగబడేవి
కావు. ప్రశ్నలకు కొన్ని సార్లు అవే కారణం అనిపించక పోయినా, వాటి ఉనికిని చూపుతూనే ఉంటాయి, ఈ పుస్తకానికి తామే ఆధారం
అవుతాయి.
More Like This