ఫాల్గుణ పౌర్ణమి (మార్చి 3) పర్వదినం నాటి రాత్రి, సద్గురు కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో కాలభైరవ ప్రాణప్రతిష్టలో భాగంగా 'కాలభైరవ స్థాపన'ను నిర్వహించారు. సద్గురు సమక్షంలో జరిగిన ఈ పావన కార్యక్రమంలో పాల్గొనే అరుదైన, గొప్ప అవకాశాన్ని వేలాది మంది పొందారు. ఈ ప్రాణప్రతిష్టతో, కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రం ఒక పరిపూర్ణమైన తీర్థ క్షేత్రంగా మారే దిశగా అడుగు వేస్తోంది - ఇది జననం నుండి మరణం వరకు, ఆ తర్వాతి ప్రయాణానికి కూడా తోడ్పడే ఒక సంపూర్ణ శక్తి వ్యవస్థ. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా, కాలభైరవుడు ఈ పవిత్ర స్థలానికి ఒక శక్తివంతమైన సంరక్షకుడిగా ఉంటారు.
Subscribe