Sadhguru
మహాశివరాత్రి మహిమను గురించి సద్గురు మాటల్లో: "సంవత్సరంలో పన్నెండు, పదమూడు శివరాత్రులు వస్తాయి. చాంద్రమాసంలోని అతి చీకటి రాత్రిని శివరాత్రి అంటారు. మాఘ మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఆ రోజు మనిషి శరీర వ్యవస్థలో శక్తి సహజంగా ఊర్ధ్వముఖంగా ఉప్పొంగుతుంది. ఈ భూగోళం ఒక ప్రత్యేక కూటమిలో ఉంది కనుక, సాధువైనా లేక పాపాత్ముడైనా, తెలిసినవాడైనా లేక తెలియనివాడైనా, యోగైనా లేక దుష్టుడైనా, ఎవరైనా సరే వెన్నెముక నిటారుగా ఉంచుకుని మేల్కొని, సావధానంగా ఈ రోజంతా కూర్చోగలిగితే, వారు తమ జన్మసార్ధకత దిశగా ముందుకు పోవచ్చు. ఇదొక గొప్ప అవకాశం. ఈ రోజు మీరు ఇది తెలుసుకోవాలన్నది నా ఆకాంక్ష, ఆశీర్వాదం. ఈ రాత్రి కేవలం జాగరణ చేసే రాత్రేకాక, జాగృతమయ్యే రాత్రి కావాలి."

మహాశివరాత్రి సాధన, మిమల్ని మహా శివరాత్రికి సంసిద్ధం చేస్తుంది. ఈ సాధనను  ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరైనా చేయవచ్చు. దీన్ని మార్చ్ 7, 2016 రోజున వచ్చే మహాశివరాత్రికి ముందు 40,21,14, 7 లేక 3  రోజులు చేయవచ్చు.

దీక్ష తీసుకోవడానికి తారీఖులు:

40 రోజుల సాధనకు - జనవరి 28, 2016.

21 రోజుల సాధనకు  -  ఫిబ్రవరి 16, 2016

14 రోజుల సాధనకు   -  ఫిబ్రవరి 23, 2016

7 రోజుల సాధనకు    -    మార్చ్1,  2016

3 రోజుల సాధనకు     -   మార్చ్ 5, 2016.

సాధన ప్రక్రియ

సాధన మార్గాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.:

ప్రతి రోజు చేయాల్సిన సాధన పద్ధతి ఇలా ఉంటుంది:

  • ఖాళీ కడుపుతో 12 సార్లు శివ నమస్కాం చేయాలి. ఆ తర్వాత ‘సర్వేభ్యో’ మంత్రాన్ని మూడు సార్లు స్తుతి చేయాలి. ఇలా రోజుకు ఒక సారి, సూర్యోదయానికి ముందు లేక సూర్యాస్తమయం తర్వాత చేయాలి.

 

సర్వేభ్యో మంత్రం

ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః

( పవిత్ర, దివ్య జీవులందరికీ మేము నమస్కరిస్తున్నాము)

ఓం పంచభూతాయ నమః

( ఈ పంచభూతాలకు నమస్కరిస్తున్నాము)

ఓం శ్రీ సద్గురవే నమః

(శాశ్వత గురువుకు నమస్కరిస్తున్నాము)

ఓం శ్రీ పృధ్వీయై నమః

(భూమాతకు నమస్కరిస్తున్నాము)

ఓం ఆది యోగీశ్వరాయ నమః

(యోగాకు మూలమైన వారికి నమస్కరిస్తున్నాము)

ఓం , ఓం , ఓం

8-10 మిరియాల గింజలను 2-3 బిల్వము లేక వేప ఆకులతో కలిపి తేనెలో, ఒక గుప్పెడు వేరుశెనగ పప్పుల్ని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. శివ నమస్కారం, మంత్రం పఠనం తర్వాత, నానబెట్టిన ఆకుల్ని నమిలి తిని, మిరియాలని నిమ్మరసంతో కలిపి తాగండి. వేరుశెనగ పప్పుల్ని కూడా తినండి. వేప లేక బిల్వ ఆకులు అందుబాటులో లేకపోతే వేప పొడితో చేసిన చిన్న ముద్దలు తీసుకోవచ్చు. వేప పొడి ఈశా షాప్ IshaShoppe.com లో అందుబాటులో ఉంది. మీరు రోజూ చేసే శాంభవి మహాముద్ర లాంటి సాధనలను తినకముందే చేయండి.

  • శివ నమస్కారం చేయటానికి కొన్ని సూచనలు:
    • గర్భిణీ స్త్రీలు శివ నమస్కరం చేయకూడదు.
    • ఋతుక్రమ సమయంలో కూడా స్త్రీలు శివ నమస్కారం చేయవచ్చు.
    • హెర్నియా సమస్య ఉన్న వారు శివ నమస్కరం చేయడానికి కొంచెం వేరుగా కుషన్ లేక కుర్చీని ఉపయోగించాలి.
    • ఒక నునే దీపాన్ని ఉదయం, సాయంత్రం వెలిగించండి. దీపం అందుబాటులో లేకపోతే ఒక కొవ్వొత్తి వెలిగించవచ్చు.
    • దీపం వెలిగించిన తర్వాత యోగ యోగ యోగీశ్వరాయ మంత్రాన్ని ఉదయం 12 సార్లు, సాయంత్రం 12 సార్లు చదవండి. ఇది  సంధ్యా కాలం 40 నిముషాల సమయంలో చేయటం ఉత్తమం. రెండు ముఖ్యమైన సంధ్యా కాలాలు సూర్యోదయం, సూర్యాస్తమయాలకు 20 నిముషాలు ముందు మొదలై 20 నిమిషాల తర్వాత ముగుస్తాయి.

    సంధ్యా కాలాలు - ఉదయం, సాయంత్రం  5.40 నుంచి 6.20 వరకు.

యోగ యోగ యోగీశ్వరాయ

యోగ యోగ యోగీశ్వరాయ

భూత భూత భూతేశ్వరాయ

కాల కాల కాలేశ్వరాయ

శివ శివ సర్వేశ్వరాయ

శంభో శంభో మహాదేవాయ

సాధనాకాలంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు:

  • రోజుకి రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోండి. మొదటి భోజనం మధ్యాహ్నం 12:00 తర్వాత చేయాలి.
  • మీకు ఆకలిగా అనిపిస్తే తేనే, నిమ్మ రసం కలిపిన నీళ్ళను మళ్ళీ తాగవచ్చు.
  • సిగిరెట్ కాల్చటం, మద్యపానం మానుకోవాలి. మాంసాహారం తినకూడదు.
  • ఒక నల్ల గుడ్డను కట్టుకోవాలి. మగవారు కుడిచేతి పైభాగంలో, స్త్రీలు ఎడమ చేతి పైభాగంలో కట్టుకోవాలి. ఎలాంటి నల్ల గుడ్డ అయినా కట్టుకోవచ్చు. ఈ గుడ్డ 12 అంగుళాల పొడవు, 1 అంగుళం వెడల్పు ఉండాలి. సాధన చేసే వాళ్ళు ఈ గుడ్డను ఎక్కడైనా కొనుక్కోవచ్చు .
  • సాధనా కాలంలో తెల్లని లేక లేత రంగు బట్టలు మాత్రమే వేసుకోవాలి.
  • రోజుకు రెండు సార్లు సున్నిపిండితో స్నానం చేయాలి.
  • ఈ స్థానాల్లో విభూదిని రాసుకోవాలి: ఆజ్ఞ – కనుబొమల మధ్య, విశుద్ధి – గొంతు గుంటలో, అనాహత – మీ పక్కటెముకలు కలిసే ప్రదేశానికి కొంచం కింద, మణిపూరక – బొడ్డు కింద. 

సాధన ఉద్యాపన

ఈ సాధన మహాశివరాత్రి రోజు ముగుస్తుంది. ఉద్యాపనను ఈశా యోగా సెంటర్లో, లేక స్థానిక ఈశా సెంటర్లో లేక మీ ఇంట్లోనే ధ్యానలింగం ఫోటో ఎదురుగా చేయవచ్చు.

దాని పద్ధతి ఇలా ఉంటుంది:

  • రాత్రంతా జాగారం చేయటం ముఖ్యం.
  • యోగ యోగ యోగీశ్వరాయ 112 సార్లు స్తుతి చేయాలి.
  • అవసరం ఉన్న ముగ్గిరికి ఆహారంగాని, డబ్బుగాని దానం చేయండి.
  • ఒక బిల్వ పత్రం/వేపాకు/ 3 లేక 5 భాగాలుగా ఉన్న ఆకును ధ్యానలింగానికి సమర్పణం చేయండి.
  • మీ చేతికి కట్టుకున్న నల్ల గుడ్డను విప్పి ధ్యానలింగం ఎదురుగా ఉన్న నంది దగ్గర కట్టండి. స్థానిక ఈశా సెంటర్లో లేక ఇంట్లోనే చేస్తున్న వారు ఈ నల్ల గుడ్డను కాల్చి, ఆ బూడిదను చేతులకు, కాళ్ళకు ఉద్యాపన తర్వాత రాసుకోండి.

     ఇంటి దగ్గరే ఉద్యాపనా కార్యక్రమం చేస్తుంటే ఈ ధ్యానలింగం ఫోటోను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Dhyanalinga