మహాశివరాత్రి - ఇది ఈశాలో అంతులేని పరవశాలు నింపిన రాత్రి
మహాశివరాత్రి అనేక అధ్యాత్మిక అవకాశాలు అందించే రాత్రి. మాఘ మాసంలో పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజు, అమవాస్య ముందురోజు శివరాత్రి.

మహాశివరాత్రి అనేక అధ్యాత్మిక అవకాశాలు అందించే రాత్రి. మాఘ మాసంలో పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజు, అమవాస్య ముందురోజు శివరాత్రి. ఈ రాత్రి అధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ప్రత్యేక సాథనలు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే ఈ పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో (ఫిబ్రవరి- మార్చ్) వచ్చే శివరాత్రి, మహాశివరాత్రి అంటారు ఎందుకంటే అది అన్నింటిలో మహత్తరమైనది, శక్తి వంతమైనది. ఈ రోజు ప్రకృతినుంచి సహజంగా ఎంతో సహాయం లభిస్తుంది. సాథకుడు తనలోని అధ్యాత్మికతను మేలుకొలపడానికి, శక్తిని ప్రేరేపింప చేయడానికీ ఆ రోజు గ్రహస్థానాలు అనుకూలంగా ఉంటాయి. ఇలా తెల్లవార్లూ మేల్కొని వెన్నెముక నిటారుగా నిలపటం, మీలోని సహజ శక్తులు ఉప్పొంగటానికి ఎంతో దోహదపడుతుంది. ఈ దేశంలో సనాతనంగా ఋషులు, మనులు ఈ శక్తి ఉప్పొంగడం వల్ల వచ్చే ఆసరాతో తమ సర్వోత్తమస్థితికి చేరుకునేవారు.
శివుడి రాత్రి అయిన ఈ మహాశివరాత్రి ఇక్కడ ఎంతో ఆనందోత్సాహాలతో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలనుంచి, ఇంకా దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి విచ్చేసారు. ఇక్కడ ముఖ్య ఆకర్షణలు
-
- శంభో, ఓం నమః శివాయ మంత్రోచ్చారణలు.
- సద్గురు తో సత్సంగం.
- సంస్కృతిక, సంగీత కార్యక్రమాలు .
సాంస్కృతిక కార్యక్రమాలు
- ఆగం – ఆధునిక కర్నాటిక్ సంగీత కళాకారులు
శాస్త్రీయ సంగీతం ఇంకా రాక మ్యూజిక్ – ఓ ఆధునిక సమ్మేళనమే ఆగమ్ . వీరి సంగీతంలో, ఈ ఫ్యుజన్ లో మీకు పాశ్చాత్య సంగీతపు హొయలు సాంప్రదాయ కర్నాటిక్ సంగీత లయలు అలవోకగా కనిపిస్తాయి . భారత ప్రభుత్వం రూపుదిద్దిన Music of Contemporary India అనే డాక్యుమెంటరి చిత్రానికి ఆగమ్ ఎన్నో ప్రశంసలను అందుకుంది . అద్భుతమైన రచనల పరంపరే ఈ ఆగమ్.
- ముక్తియార్ అలీ – సుఫీ గాయకుడు
రాజస్తాన్ ప్రాతంలోని బికనేర్ నుండి వచ్చిన జానపద గాయకుడు ముక్తీయర్ అలి. మిరాసిస్ అనబడే ఓ లంబాడీ తెగకు చెందివారీయన . వారి కుగ్రామం ఉత్తర భారత దేశపుటంచులలోని పుగల్. ఈ పుగల్ వాసులు విశిష్టమైన గాయకులు, వీరు సూఫియానా ఖాలం అనే గాన పరంపరను తరతరాలుగా పోషిస్తూ వచ్చారు.
- సౌండ్స్ అఫ్ ఈశా – ఈశా సంగీత మండలి
'కుంభ మేళ తరువాత జరిగిన అతి పెద్ద సంగమం' - హర్పర్స్ బాజార్ పత్రిక
మహాశివరాత్రికి ఒక రోజు ముందే ఈ వేడుకలు మొదలయ్యాయి, ఆశ్రమాన్నంతా ఏంతో అందంగా అలంకరించారు
పూలహారాలను ధ్యానలింగ ఆలాయానికి అలంకరించారు
వంటశాలలో అందరూ ఎంతో హుషారుగా మహా అన్నదానానికి భోజనాలు తయారు చేసారు
ధ్యానలింగ ఆలయంలో స్వయంగా సద్గురు పాల్గొన్న పంచభూత ఆరాధనతో కార్యక్రమం మొదలయ్యింది. సుమారు 400 మంది ఇందులో పాల్గొన్నారు. పంచభూతాలను ధ్యానలింగానికి ఈ ఆరాధనలో అర్పణ చెస్తూ వారి దేహాలలో భూతశుద్ధి ప్రక్రియను అనుభూతిచెంది పారవశ్యంలో మునిగి తేలారు.
ఈశా బ్రహ్మచారులు చేసిన నిర్వాణ శట్కం మంత్రోచ్చరణతో ఈ కార్యక్రమం మొదలయ్యింది
సద్గురు అందరితో యోగ యోగ యోగిశ్వరాయ మంత్రోచ్చారణ చేయించారు
ఈశా వారి పుస్తకాలను పలువురు ప్రముఖులు విడుదల చేసారు
ఆగం బ్యాండ్ వారి సంగీతానికి అందరూ ఉత్సాహంలో మునిగి తేలారు
రాజస్తాన్ నుండి వచ్చిన కుత్లె ఖాన్ ఇంకా సౌండ్స్ ఆఫ్ ఈశా బృందం కలిసి చేసిన ప్రదర్శన
మహాశివరాత్రి వేడుక స్థలంలో పైనుండి తీసిన దృశ్యాలు
అర్ధరాత్రిన సద్గురు అందరితో శంభో ఇంకా ఓం నమః శివాయ మంత్రోచ్చారణ చేయించారు
ఈశా సంస్కృతి వారు యోగాసనాల ప్రదర్శన చేసారు
\
సద్గురు అందరితో మమేకమైపోయి ఆటపాటల్లో మునిగి తేల్చారు
ఈశా సంస్కృతి వారి కలరియపట్టు ప్రదర్శన
ఈశా మహోత్సవ కార్యక్రమ ముగింపులో కుత్లె ఖాన్ ఇంకా సౌండ్స్ ఆఫ్ ఈశా బృందం కలిసి ప్రదర్శన చేసారు
మీడియా భాగస్వాములు
ముఖ్య స్పాన్సర్
సహాయ స్పాన్సర్