కర్ఱాటక పులిహోర
కావాల్సినపదార్థాలు:
చింతపండు - పెద్దనిమ్మకాయంత
ఎండుమిర్చి - 5
మెంతులు - 1/4 టీస్పూను
దాల్చినచెక్క - 1చిన్నముక్క
ధనియాలు - 1 టేబుల్ స్పూను
జీలకర్ర- అరటీస్పూను
మిరియాలు - 1 టీస్పూను
తెల్లనువ్వులు - అరటీస్పూను
వేరుశనగగింజలు - 50గ్రా.
కొబ్బరికోరు - 1కప్పు
బియ్యం - 2 గ్లాసులు
ఉప్పు - తగినంత
మంచినూనె - 4టీస్పూనులు
బెల్లంకోరు - 25గ్రాములు
కరివేపాకు - కొంచెం
తాలింపు - ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, శనగపప్పు, ఎండుమిర్చి(2)
చేసేవిధానం:
- చింతపండు నీళ్ళల్లో నానపెట్టి చిక్కటి పులుసు తీసుకోవాలి. బియ్యం కడిగి 4 గ్లాసులు నీరు పోసి కుక్కర్లో వండు కోవాలి. అన్నం పొడిగా వుండాలి.
- ఒక బాణలిలో మెంతులు, దాల్చిన చెక్క మంచి వాసన వచ్చేదాకా వేయించాలి. ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు కూడా వేయించుకుని పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు బాణలిలో చింతపండు రసం, మనం తయారు చేసిపెట్టుకున్న పొడి కలిపి బాగా ఉడికించాలి. అందులో 1 టీస్పూను నూనె ఉప్పు వేసి సిమ్లో వుంచాలి. బెల్లం కూడా కలిపి మగ్గించి దింపుకోవాలి. మిగిలిన నూనెలో తాలింపువేసి వేరుశనగ గింజలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపు చింతపండు పులుసులో వేయాలి.
- ఇంకో బాణలిలో నూనె వేసి తెల్ల నువ్వులు, కొబ్బరి కోరు వేయించాలి(విడివిడిగా). ఇది కూడా చింతపండు పులుసులో వేయాలి. ఒక పెద్ద పళ్ళెంలో అన్నం ఆరపెట్టి కొద్దికొద్దిగా ఈ పులుసు కలుపుకోవాలి. రుచికరమైన కర్ణాటక పులిహోర రెడీ. (కొబ్బరి, నువ్వులు వెయ్యకుండా వుంటే ఈ పులుసు చాలా రోజులు నిలవ వుంటుంది.)