కావాల్సిన పదార్థాలు:

సంజీవని పిండి - 1కప్పు 

ఉప్పు, నూనె - తగినంత

ఆవాలు, మినప్పప్పు - 1 టీస్పూను

మిరియాల పొడి - చిటికెడు

కరివేపాకు - 1 రెబ్బ

జీలకర్ర - 1 టీస్పూను

క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజి - సగంకప్పు- చిన్నముక్కలు

చేసే విధానం:

- సంజీవని పిండిలోఉప్పువేసి కొంచెం నీరుపోసి గట్టిగా కలుపుకోవాలి. అది ఇడ్లీపాత్రలో ఆవిరికి ఉడికించాలి.

- బాణలిలో నూనె పోసి తాలింపు వేసుకోవాలి. తరువాత తరిగి పెట్టుకున్న కూర ముక్కలు వేసి మిరియాల పొడి, కరివేపాకు వేసి మగ్గించాలి. ఆ తరువాత ఉడికించిన సంజీవని పిండి పొడిగా చేసుకుని బాణలిలో వేయాలి. కలియబెట్టి, వడ్డించుకోవాలి.