సద్గురుతో సత్సంగం విజయవాడలో!
సద్గురు మొట్టమొదటి సారిగా విజయవాడలో ఒక పబ్లిక్ సత్సంగం కోసం విచ్చేస్తున్నారు అని తెలియజేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా విజయవాడ, గుంటూరులలోని వాలంటీర్లు సద్గురు ఆగమనం కోసం కృషి చేస్తూ ఉన్నారు,వారి కల నిజమవ్వటం మన అదృష్టం!
సంగీతం! మర్మజ్ఞత!! ధ్యానం!!!
సద్గురుతో సత్సంగం విజయవాడలో!
27 డిసంబర్ సాయింత్ర 6:30 కి
ప్రత్యక్ష తెలుగు అనువాదం చేయబడుతుంది
వివరాలకి:9912944486
నమస్కారం!
సద్గురు మొట్టమొదటి సారిగా విజయవాడలో ఒక పబ్లిక్ సత్సంగం కోసం విచ్చేస్తున్నారు అని తెలియజేయటానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా విజయవాడ, గుంటూరులలోని వాలంటీర్లు సద్గురు ఆగమనం కోసం కృషి చేస్తూ ఉన్నారు,వారి కల నిజమవ్వటం మన అదృష్టం!
డిసెంబరు 27 సాయంత్రం సధ్గురు సత్సంగంలో పాల్గొనటానికి, వారి కృపను ప్రత్యక్షంగా అనుభూతి చెందటానికి మేడిటేటర్లకు, అలాగే మిగతావారందరికీ కూడా ఇది ఒక అరుదైన అవకాశం. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి సద్గురుకి సమయం దొరకడం క్రమక్రమంగా కష్టంగా మారుతూ ఉంది.మరలా ఈ ప్రాంతానికి వారు ఎప్పుడు రాగలరో కూడా మనకు తెలియదు. అందువల్ల ఈ సత్సంగంలో పాల్గొనమని, అలాగే విజయవాడ, గుంటూరు ప్రాంతాలలోని వారందరిని ఈ సత్సంగంలో పాల్గొనటానికి ఆహ్వానించమని మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాము.
తేదీ :27 డిసెంబరు, 2014
సమయం :సాయంత్రం 6.30 నుంచి 8.30 లేదా 9 వరకు
వేదిక :విజయవాడ క్లబ్, కనక దుర్గ వారది వద్ద, తాడేపల్లి, గుంటూరు జిల్లా
గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు:
- ఈ కార్యకరంలో అందరు ఉచితంగా పాల్గొనవచ్చు.
- పరిమితమైన స్థలం ఉండటంవల్ల ఈశా మెడిటేటర్లు, అలాగే పబ్లిక్ తప్పక రిజిస్ట్రేషను చేసుకోవాలి.
- ఎవరు ముందు వస్తే వారికి ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి కన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది.
- ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి కనీసం వయస్సు 14 ఏళ్ళు.
- పార్కింగ్ స్థలం తక్కువ ఉండటం వల్ల కారులో వచ్చేవారు తెలిసన వారితో కలిసి వస్తే (కార్ పూల్) మంచిది.
రిజిస్ట్రేషను చేసుకోవడటం:
1. ఆన్ లైనులో రిజిష్ట్రేషన్ చేసుకోవడానికి ఈ ఫారం ( http://goo.gl/forms/Z48L6bYygk ) నింపండి
2. మీ దగ్గరి ప్రాంతంలో రిజిస్ట్రేషను కోసం లేదా మరిన్ని వివరాలకోసం సంప్రదించండి : 9912944486.
ప్రణామాలతో,
ఈశా వాలంటీర్లు