కావాల్సినపదార్థాలు

గసగసాలు - 1/4 కప్పు

చక్కెర - సగంకప్పు

పాలు - 1 కప్పు

ఏలక్కాయలు- కావలసినంత

జీడిపప్పులు - 10.

నెయ్యి- 1-స్పూను

చేసేవిధానం:

  • గసగసాలు నీటిలో 2 లేక 3 గంటలు నానపెట్టి మెత్తగా నూరుకోవాలి. ఒక బాణలిలో నీరుపోసి(1 కప్పు) చక్కెరవేసి, పాకం రానివ్వాలి. తరువాత తీగపాకం వచ్చాక గసగసాల ముద్దవేసి, పచ్చి వాసన పోయేదాకా మరిగించాలి. ఆఖరికి పాలు పోసి ఏలకుల పొడి చల్లుకుని, నెయ్యిలో వేయించిన జీడిపప్పు కూడా కలుపుకుని తినాలి.