మృత్యువుకి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు
ArticleJan 23, 2017
మృత్యువుకి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలను తెలుసుకుందాం.
- ప్రతి శ్వాసతోనూ మనం స్మశానానికి ఒక అడుగు చేరువ అవుతున్నాము. శరీరం, మనసులకు అతీతంగా ఉన్న పార్శ్వాన్ని శోధించే సమయం ఇదే.
- ఈ శరీరం శాశ్వతం అనుకోవద్దు - అది ఎప్పటికీ ఉండిపోయేది కాదు.
- ప్రజలకు మృత్యువంటే అంత భయం ఉండడానికి ఏకైక కారణం, శరీరానికి మించి ఏమీ తెలియకపోవడమే.
- జననం, మరణం అనేవి జీవం ఒక స్థితినుండి మరో స్థితికి వెళ్ళే మార్గాలు మాత్రమే.
- ఒక రకంగా ప్రతి వ్యక్తీ జీవన్మరణాల కలయికే. మీరు చేసే ప్రతిపనీ ఈ రెండిట్లో ఏదో ఒకదానికి దోహదపడుతుంది.
ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.