logo
logo

మహాశివరాత్రి గురించిన ఐదు ముఖ్య విషయాలు

మహాశివరాత్రి గురించిన ఐదు ముఖ్య విషయాలు


ఈశా యోగా కేంద్రంలో 2019 మార్చ్ 4 వ తేదీన మహాశివాత్రి ఉత్సవం రాత్రి తెల్లవార్లూ ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆ వేడుకలకు సిద్ధమవుతూ మహాశివరాత్రి గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు ముఖ్య విషయాలు. ఈ రాత్రి అందించే ఆధ్యాత్మిక ఆవశ్యకతలు మీకోసం అందిస్తున్నాం.

#1 మానవ చైతన్యం ఉప్పొంగుతుంది


Sadhguru: చాంద్రమానం ప్రకారం ప్రతినెలా వచ్చే 14వ రోజు అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజును శివరాత్రి అంటాము. ఈ రోజున సహజంగానే మానవ చైతన్యం ఉప్పొంగుతుంది. అన్నినెలలకన్నా, సంవత్సరంలోని పదకొండవ నెల అయిన మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. ఈ ప్రత్యేకమైన రోజున వ్యవస్థలో శక్తి ఉప్పొంగేందుకు ప్రకృతి సహకరిస్తుంది. ఆధ్యాత్మిక లేదా యోగ ప్రక్రియ అంటే మానవుడిని పరిమితత్త్వం నుండి అనంతంగా విస్తరింపజేయడమే. ఈ విస్తరణ జరగాలంటే మౌలికమైన ప్రక్రియ ఏమిటంటే శక్తి పైకి కదిలేలాగా ఉత్తేజితమవ్వాలి. ప్రస్తుతం, వారు ఉన్నదానికంటే మరికొంచెం ఎదగాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో, వారికి శివరాత్రి ముఖ్యమైనది, మహాశివరాత్రి మరెంతో విశిష్టమైనది.


#2 విభిన్నమైన వారికి విభిన్న ప్రాముఖ్యతలు


Sadhguru: మహాశివరాత్రి అందరికీ ఎన్నో విధాలుగా విశిష్టమైనది. గృహస్తాశ్రమంలో ఉన్నవారు మహాశివరాత్రిని శివుని కళ్యాణం జరిగిన రోజుగా చూస్తారు. తాపసులు, దానిని శివుడు ఆచలేశ్వరుడుగా మారి కైలాసపర్వతంతో ఒక్కటైనా రోజుగా భావిస్తారు. ఎన్నో వేల సంవత్సరాల ధ్యానం తరవాత ఆయన ఒక పర్వతంలా, నిశ్చలంగా మారి ఆయన జ్ఞానాన్నంతా కైలాసంలో నిక్షిప్తం చేసారు. అందుకని తాపసులు మహాశివరాత్రిని నిశ్చలతత్త్వానికి ప్రతీకమైన రోజుగా చూస్తారు. ఇక ప్రపంచంలో ఎదో సాధించాలి అనుకునే వారు, ఈరోజున శివుడు శత్రు సంహారం చేసిన రోజుగా పరిగణిస్తారు.

#3 రాత్రంతా వెన్నుముకను నిటారుగా ఉంచడంవల్ల ఎన్నో అవకాశాలు తెరుచుకుంటాయి.

Sadhguru: ఈరోజు ప్రాముఖ్యత ఏమిటంటే, మానవ దేహంలో చైతన్యం ఉప్పొంగుతుంది. అందుకే ఈరోజు రాత్రంతా వెన్నుముకని నిటారుగా ఉంచి, ఎరుకతో జాగారం చేస్తే, మనం ఏ సాధన చేసినా, దానికి ప్రకృతి నుండి గొప్ప సహకారం దొరుకుతుంది. మౌలికంగా మానవుడిలో పరిణామం అంటే, శక్తి పైకి కదలడం. ఆధ్యాత్మిక సాధకుడు చేసే ప్రతి సాధనా, ఈ శక్తిని పైకి కదిలించడానికే.

#4 రాత్రి, తెల్లవార్లూ ఆట పాటల ఉత్సవం

ఈశా యోగా కేంద్రంలో రాత్రి తెల్లవార్లూ, ఈ పండుగ ఎంతో ఉత్సాహభరితంగా జరుగుతుంది. మహాశివరాత్రిని అనుభూతి చెందేందుకు, విస్ఫోటనం లాంటి అద్భుత ధ్యానాలు, ప్రఖ్యాత కళాకారులందించే సంగీత కార్యక్రమాలు, చక్కటి వాతావరణాన్ని ఏర్పరచడం ద్వారా, లక్షల కొద్దీ ప్రజలను ఆకర్షిస్తాయి. సద్గురు సాన్నిధ్యంలో ఈ రాత్రి అంతులేని ఆధ్యాత్మిక అవకాశాలకు ద్వారం తెరుస్తుంది. విశ్వ ప్రఖ్యాతి గాంచిన సంగీత కళాకారులు అందించే సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు, సౌండ్స్ అఫ్ ఈశా, ఇవన్నీ రాత్రి తెల్లవార్లూ మిమ్మల్ని అలరిస్తాయి.

#5 సద్గురు సాన్నిధ్యంలో పంచభూత ఆరాధన

మీ భౌతిక దేహంతో సహా, ఈ సృష్టి అంతటికీ మూలం పంచభూతాలు. వీటిని శుద్ధి చేయడంద్వారా మానవ వ్యవస్థలో శారీరక, మానసిక శ్రేయస్సు ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ శరీరాన్ని ఒక అడ్డంకిగా కాకుండా, ఒకరి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సోపానంగా మలుస్తుంది. యోగ విధానంలో భూతశుద్ది అనే ప్రక్రియ ఒకటి ఉంది. ఎంతో సాధనతో మాత్రమే సాధ్యమయ్యే దానిని, ఈ పంచభూత ఆరాధన ద్వారా సద్గురు భక్తులకు అందిస్తారు.

    Share

Related Tags

ఆదియోగి

Get latest blogs on Shiva

Related Content

శివుడు, గణేశుడు ఇంకా పార్వతి దేవీ - గణేశుణి జనన కధ