కారైకాల్ అమ్మాళ్ - చేతినడక మీద కైలాస పర్వతానికి చేరుకుంది
స్త్రీల దినోత్సవం సందర్భంగా సద్గురు మనతో ఒక గొప్ప శివ భక్తురాలి జీవితంలో జరిగిన ఒక విచిత్ర సంఘటనని మనతో పంచుకుంటున్నారు.
శివుడికి చెందిన వివిధ రకాల వారున్నారు. ఎటువంటి ఆరాధనకీ పరిమితమైపోని మార్మికులు ఉన్నారు - వీళ్ళు ఆలయాలకో, మందిరానికో వెళ్ళరు, ఎటువంటి పూజా చెయ్యరు. కానీ శివుడే వారి శ్వాస. అలాగే కొంతమంది యోగులుఉన్నారు - వీళ్ళు ఎప్పుడూ సాధనలో మునిగి ఉంటారు. వీరి జీవితం అంతా కూడా ఈ పార్శ్వమే..! వీరే కాదు, అద్భుతమైన మంత్రాలను ఉచ్చరించిన, ఎంతో గొప్ప శిల్పకళలను కలిగి ఉండే ఆలయాలను కట్టిన భక్తులు కూడా ఉన్నారు. జీవితాన్ని భక్తితో పరిణమింపజేసుకున్న సాధారణమైన భక్తులు, ఇలా ఎంతోమంది ఉన్నారు. లెక్కకు అందనంత మంది భక్తుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ రోజు స్త్రీల దినోత్సవం కాబట్టి, నేను ఇక్కడ ఎంతో తేజస్సు కలిగిన స్త్రీ భక్తుల గురించి మాట్లాడుతాను. ఇందులోఒకరు అక్కమహాదేవి.
ఈ రోజున అది మూడు రోజుల యాత్ర. అటువంటి పరిమాణంలో ఉన్న కైలాస పర్వతాన్ని మొత్తం, ఆవిడ చేతుల మీద నడిచింది. ఎందుకంటే, ఈవిడకి ఆ భూమి ఎంతో పవిత్రంగా తోచింది. కైలాస పర్వతం మీద ఆవిడ పాదం మోపలేకపోయింది. అందుకని మొత్తం కైలాస పర్వతం చుట్టూ చేతులతో నడచింది. ఈరోజున స్త్రీల దినోత్సవం కదా, అందుకని నేను స్త్రీ భక్తుల గురించి చెబుదామనుకున్నాను. ఇలాంటి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. మన గడ్డమీద నుంచి కూడా ఎంతోమంది స్త్రీలు ఇలా భక్తులుగా రూపు దిద్దుకోవాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది ఇలా పరిమళించాలి, వికసించాలి. మీ భక్తి, మీ పరిమితులను దాటి, మిమ్మల్ని ఆవల తీరాలకు తీసుకువెళ్ళేదిగా ఉండాలి. మీ భక్తి అన్నది దీన్నిగురించో, దాన్నిగురించో అడిగేదిగా ఉండకోడదు. మీ భక్తి మీరు లయమైపోయేదిగా ఉండాలి. “మీరు” - అన్నది ఇక లేనట్లుగా ఉండాలి.