నదుల రక్షణ ఉద్యమం - 12వ రోజు : హైదరాబాద్
విజయవాడలో విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ కి చేరిన నదుల రక్షణ ఉద్యమం....
సాంస్కృతిక కళాకారులు సద్గురుని కార్యక్రమ వేదిక దగ్గర స్వాగతించారు..
సద్గురు ఇంకా ముఖ్య అతిధులు వేదికకు విచ్చేశారు..
సౌండ్స్ అఫ్ ఈశా బృందం ప్రజలని తమ సంగీతంతో ఆనందింపజేశారు..
నాగరత్నం నాయుడు, తక్కువ నీళ్ళతో ఎక్కువ దిగుబడి వ్యవసాయాన్ని చేసి చూపించిన రైతు. నదుల రక్షణ ఉద్యమానికి మిస్ కాల్ ద్వారా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నాను అన్నారు. అగమ్యగోచరంగా ఉన్న మన జీవితాలకు దారి చూపించిన సద్గురుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చెప్పారు. ఈ నదుల రక్షణ ఒక్కరి గురించి కాదని ప్రతి ఒక్కరూ బాధ్యతా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు చలన చిత్రానికి అద్భుత సంగీతాలను సమకూర్చిన కీరవాణి గారు ఇలా అన్నారు "సద్గురు కంఠంలోంచి వచ్చిన ఆ రాగం, నాకు సంగీతంలా అనిపించలేదు. గుండెలోతుల్లోంచి పొంగిన ఆవేదనలా అనిపించింది. నేను చేయగలిగింది ఆయన మార్గంలో నడవడమే, మీ అందరూ కూడా ఆయన మార్గంలో నడవమని కోరుకుంటున్నాను " అని అన్నారు.
నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు గారు సద్గురు చేపట్టిన ఈ కార్యక్రమానికి తెలంగాణా ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని..ఇటువంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సద్గురుకి తల వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.
ఆ తరువాత కేశవరావు గారు ఇంకా ఇతర అతిధులు నదుల రక్షణలో తాము భాగస్వాములం అని, తమ సంపూర్ణ మద్దతుని తెలియజేసారు..
ఎంతో ఉత్సాహంగా సద్గురుకి మద్దతు తెలపడానికి అన్ని వర్గాల ప్రజలు కార్యక్రామానికి హాజరయ్యారు..వారిని చూసి సద్గురు ఎంతో ఆనందగా ఉందని..ఈ ఉత్సాహంతో అక్టోబర్ 2 తాను ఢిల్లీ చేరేవరకు వరకు కొనసాగించమని, నదుల రక్షణ కోసం అవగాహన కల్పించమని కోరారు..