పళ్ళు, పండు గుమ్మడి సలాడ్
ArticleDec 10, 2016
కావాల్సిన పదార్థాలు :
పండు గుమ్మడి - 1 కప్పు ముక్కలు
దానిమ్మ గింజలు - 1 కప్పు
ద్రాక్ష (ఆకుపచ్చని)- 1 కప్పు (గింజలు లేనివి)
నువ్వులు - 1 టీస్పూను (వేయించుకోవాలి)
తేనె - 1 టీస్పూను
దాల్చినచెక్క - చిన్న మొక్క
ఉప్పు - చిటికెడు
నిమ్మరసం - 1 టీస్పూను
చేసే విధానం :
గుమ్మడి చెక్కుతీసి, చిన్న ముక్కలు చేసి ఒక గిన్నెలు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత వడకట్టి ఒక ప్లేటులో ఆరపెట్టుకోవాలి. తరువాత ఆకుపచ్చ ద్రాక్ష, దానిమ్మ గింజలు కలిపి ఉంచుకోవాలి. మిక్సీలో తేనె, దాల్చినచెక్క ఉప్పు, నిమ్మరసం వేసి పేస్టు చేసి పెట్టుకోవాలి. ఈ పళ్లల్లో మిక్సీలో వేసిన పేస్టు, వేయించుకున్న నువ్వులు వేసి అన్నీ కలుపుకోవాలి. అందరికీ వడ్డించాలి.