మేము ‘కాలభైరవ కర్మ’ అనే ఒక ప్రక్రియను ప్రారంభించాము. ఇది చనిపోయిన వారి కోసం. వారి కొత్త ప్రదేశం మేలైనదై ఉండేలా చేసేందుకు. ఎవరైనా చనిపోతే, మీరు అతనిక లేడు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు మాత్రం, కేవలం అతని శరీరం, ఇంకా తను జీవితమని అనుకున్నదంతా పోయింది. ఎప్పుడయితే తను శరీరాన్ని కోల్పోయాడో, తన విచక్షణ జ్ఞానాన్ని కూడా అతడు కోల్పోతాడు. విచక్షణను కోల్పోవడం అంటే ఏమిటి? ఉదాహరణకు మీకు తెలిసిన వారెవరో చనిపోయారనుకుందాం. మీరు విచారంతో, బాధతో ఉన్నారు. బహూశా కొంత సమయం ఈ విచారం కొనసాగొచ్చు, కానీ కొంత కాలం గడిచాక మీరు మీలోని విచక్షణను ఉపయోగించి “ఇలా ఎప్పటికీ ఉండడంలో అర్థం లేదు, నేను చేయాల్సిన వాటి పైన తిరిగి దృష్టి పెట్టాలి” అని తెలుసుకుంటారు. కానీ ఎవరైతే ఈ విచక్షణను ఉపయోగించలేరో, వారు అదే స్థితిలో చాలా కాలం కొనసాగుతారు, ఎందుకంటే వారిలో విచక్షణ బుద్ధి పనిచెయ్యడం లేదు. కనుక అతని ధోరణులు ఎలా ఉంటాయో, అవి మరింత ఎక్కువ అవుతాయి. తనలో ఆహ్లాదకరమైన ధోరణులు ఉంటే, ఆహ్లాదకరమైన స్థితిలో మునుగుతాడు. అతనిలో బాధాకరమైన ధోరణులు ఉంటే, అవి మరింత తీవ్రమైన బాధగా మారతాయి.

ఎక్కడా, ఏ మతం అనే దానితో సంబంధం లేకుండా, ప్రతీ సంస్కృతికీ ఈ అవగాహన ఉంది- ఒక మనిషి చనిపోతున్నప్పుడు, అతను ఎవరైనా గానీ, మీరు తప్పకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలి. మీ శత్రువు చనిపోతున్నప్పటికీ, ఆ ఒక్క క్షణం మీరు అతనికి విచారం కలిగించ కూడదు.

కాబట్టి మరణం చివరి క్షణంలో గానీ లేదా చనిపోయిన కొద్ది రోజుల్లో, మనం ఆ జీవంలోకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రవేశ పెట్టొచ్చు. ఒక్కసారి ఇలా ఆహ్లాదం ఇవ్వబడితే, అది ఒక చుక్క ఆహ్లాదం అయినా సరే- మీరు అతనిలోకి ప్రవేశపెడితే, కొంతకాలం తరువాత అది సముద్రమంత ఆహ్లాదంగా మారిపోతుంది, ఎందుకంటే అతనికి విచక్షణ లేదు, అతడు దానిని ఆపలేడు.

అందుకు, 50 ఏళ్ళు పైబడి సహజ మరణం పొందిన వారికి 14 రోజుల వరకు, 50 ఏళ్ల లోపు చనిపోయిన వారికి 48 రోజుల వరకు, మనం కొంత ఆహ్లాదాన్ని ఆ జీవంలోకి ప్రవేశింప జేయవచ్చు. ఒకవేళ ఎవరైనా చురుగ్గా, ఉత్సాహంగా ఉండి, ప్రమాదంలోనో, ఆత్మహత్య చేసుకునో మరణిస్తే- 33 ఏళ్ళు పైబడిన వారికి 48 రోజుల వరకు, 33 ఏళ్ల లోపు వారికి 90 రోజుల వరకు మనం దీనిని చేయవచ్చు. మరణించిన తరువాత ఎప్పుడైనా చేయగలిగే ‘కాలభైరవ శాంతి’ అనే మరో ప్రక్రియను కూడా మేము అందిస్తున్నాము.

ఇది యోగా సంప్రదాయంలో ముఖ్యమైన భాగంగా ఉంది- ఎవరైనా మరణిస్తే, అతనికి తన మరణాన్ని సరిగ్గా నిర్వహించుకునే అవగాహన లేకపోతే, అప్పుడు మరొకరు అతని కోసం ఇది చేస్తారు. కానీ దురదృష్టవశాత్తూ, బహుశా గత 100-150 సంవత్సరాలలో ఈ సంప్రదాయాలు చాలా వరకు నిద్రాణమైపోయాయి. ఇప్పుడు మిగిలింది అవినీతి వ్యాపారమే. మీకు బాగా ప్రియమైన వారు చనిపోతే, వారు చనిపోయిన వారి కోసమని చెప్పులు, గొడుగు, ఆవు, గుర్రం ఇలాంటివి తీసుకురమ్మని కోరతారు. ఈ రోజుల్లో మెర్సిడెస్ బెంజ్ కారును కూడా తీసుకురమ్మని అడగొచ్చు. చనిపోయిన వ్యక్తికి చెప్పులు అవసరం లేదు. శరీరము లేని వ్యక్తి, చెప్పులు వేసుకోలేడు. దీన్ని నిర్వహిస్తున్న వ్యక్తికి చెప్పులు కావాలంటే, అతను నిజాయితీగా ముందుకొచ్చి ‘‘నాకు చెప్పు కావాలి” అని అడగాలి. అప్పుడు కనీసం సరైన సైజు దొరుకుతుంది. చనిపోయిన మనిషి సైజు తీసుకుంటే, అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్ముకోవాలి.

మేము భైరవి దేవాలయాన్ని శక్తి స్థావరంగా ఉపయోగించి, మరణించిన వారికి కొన్ని ప్రక్రియలను చేస్తాము. మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోయినా, లేదా మీకు తెలిసిన వాళ్ళ కుటుంబాలలో ఎవరైనా చనిపోయినా, వారు తొడుకున్న దుస్తులలో కొంత బాగాన్ని, మాకు ఒక నిర్ధిష్ట వ్యవధిలో పంపిస్తే, ఇక్కడ ఒక ప్రక్రియ చేస్తాము.

ప్రజలు ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము. అది సాధ్యం కాకపోతే, వారు ఆనందంగా జీవించ లేకపోతే, కనీసం వారి మరణమైనా ప్రశాంతంగా జరగాలి. అది కూడా సాధ్యం కాకపోతే, అప్పుడు మేము మరణించిన తరువాత అయినా, వారికోసం ఏదైనా చేయాలనుకుంటున్నాము. కాబట్టి మీరు చనిపోయినా, మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి నా ప్రయత్నాలను నేను వదిలిపెట్టను.

Blessings.

Editor's note: Kayantha Sthanam is Isha’s Cremation Service ​that r​evive​s ancient traditions and death rituals with a powerful energy basis, conducting them in the spirit of service rather than as a commercial venture. ​We request your support and contributions to help us offer​ these services to more people. For more info, visit Kayantha Sthanam – Isha’s Cremation Services.