శివుడికి చెందిన వివిధ రకాల వారున్నారు.  ఎటువంటి ఆరాధనకీ పరిమితమైపోని మార్మికులు ఉన్నారు -  వీళ్ళు ఆలయాలకో, మందిరానికో వెళ్ళరు, ఎటువంటి పూజా చెయ్యరు.  కానీ శివుడే  వారి శ్వాస.  అలాగే కొంతమంది యోగులుఉన్నారు - వీళ్ళు ఎప్పుడూ సాధనలో మునిగి ఉంటారు.  వీరి జీవితం అంతా కూడా ఈ పార్శ్వమే..!  వీరే కాదు,  అద్భుతమైన మంత్రాలను ఉచ్చరించిన, ఎంతో గొప్ప శిల్పకళలను కలిగి ఉండే ఆలయాలను కట్టిన భక్తులు కూడా ఉన్నారు. జీవితాన్ని భక్తితో పరిణమింపజేసుకున్న సాధారణమైన భక్తులు, ఇలా ఎంతోమంది ఉన్నారు. లెక్కకు అందనంత మంది భక్తుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ రోజు స్త్రీల దినోత్సవం కాబట్టి, నేను ఇక్కడ ఎంతో తేజస్సు కలిగిన స్త్రీ భక్తుల గురించి మాట్లాడుతాను. ఇందులోఒకరు అక్కమహాదేవి.

ఈ రోజున అది మూడు రోజుల యాత్ర. అటువంటి పరిమాణంలో ఉన్న  కైలాస పర్వతాన్ని మొత్తం, ఆవిడ చేతుల మీద నడిచింది.
తమిళనాడుకు చెందిన మరొక గొప్ప యువతి కారైకాల్ అమ్మాళ్. ఈవిడ ఎవరితోనూ తన పేరు కూడా చెప్పలేదు.  ఆవిడ కారైకాల్ అనే ఊరి నుంచి వచ్చింది కాబట్టి ఆవిడను కారైకాల్ అమ్మాళ్ అన్నారు. ఆవిడ శివుడి మీద తనకున్న భక్తిని, ఇష్టాన్ని ఎంతో గొప్పగా, మధురంగా వ్యక్తపరచింది. ఈవిడ కైలాస పర్వతానికి కాలి నడకన వెళ్లింది. మీరు ఇక్కడ ఏమి అర్థం చేసుకోవాలంటే, తమిళనాడు నుంచి కైలాస పర్వతం వరకూ నడవడం, కైలాస పర్వతాన్ని చేరుకోవడం..అందునా ఒక స్త్రీ..! ఈవిడకి, ఇప్పుడు మీకు ఉన్నట్లుగా ప్యాంట్లుగానీ, స్వెటర్లు గానీ, థర్మల్స్ గానీ లేదా వెదర్ ప్రూఫ్ జాకెట్స్ కానీ- అలాంటివేమీ లేవు. ఆవిడ కేవలం అలా నడచుకుంటూ వెళ్లింది. ఆవిడ అక్కడికి చేరుకున్న తరువాత ఆ ప్రదేశం ఆవిడకి శివుడి శరీరంగా తోచింది. అందుకని, ఆవిడ అక్కడ ఆ కైలాస పర్వతం మీద కాలు మోపలేకపోయింది.

ఈ రోజున అది మూడు రోజుల యాత్ర. అటువంటి పరిమాణంలో ఉన్న కైలాస పర్వతాన్ని మొత్తం, ఆవిడ చేతుల మీద నడిచింది. ఎందుకంటే, ఈవిడకి ఆ భూమి ఎంతో పవిత్రంగా తోచింది. కైలాస పర్వతం మీద ఆవిడ పాదం మోపలేకపోయింది. అందుకని మొత్తం కైలాస పర్వతం చుట్టూ చేతులతో నడచింది. ఈరోజున స్త్రీల దినోత్సవం కదా, అందుకని నేను స్త్రీ భక్తుల గురించి చెబుదామనుకున్నాను. ఇలాంటి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. మన గడ్డమీద నుంచి కూడా ఎంతోమంది స్త్రీలు ఇలా భక్తులుగా రూపు దిద్దుకోవాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది ఇలా పరిమళించాలి, వికసించాలి. మీ భక్తి, మీ పరిమితులను దాటి, మిమ్మల్ని ఆవల తీరాలకు తీసుకువెళ్ళేదిగా ఉండాలి. మీ భక్తి అన్నది దీన్నిగురించో, దాన్నిగురించో అడిగేదిగా ఉండకోడదు. మీ భక్తి  మీరు లయమైపోయేదిగా ఉండాలి. “మీరు” -  అన్నది ఇక లేనట్లుగా ఉండాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు