కావాల్సిన పదార్థాలు :

వేరుశనగ గింజలు            -          1 గుప్పెడు

అరటిపండు        -          1

ఖర్జూరం -          5 (చిన్న ముక్కలు)

తేనె       -          కొద్దిగా

జీడిపప్పు            -          కావలసినంత

కొబ్బరికోరు        -          3 స్పూనులు

చేసే విధానం : -   వేరుశనగ గింజలు అరగంట నానపెట్టుకోవాలి. నానినవి శుభ్రంగా కడగాలి. పైన చెప్పినవి అన్నీ మిక్సీలో వేసి నీరుపోసి వడగట్టి తాగాలి. అరటిపండు బదులు సపోటా, జామ, ఆపిల్‌, మామిడి పళ్ళు వాడవచ్చు.  ఇది శక్తినిచ్చే - జ్యూస్‌ ఖాళీ కడుపుతో సేవిస్తే ఆకలి కాదు.