హైదరాబాద్, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం నగరాలలో సత్సంగాలు....

నూతన సంవత్సరానికి ఓ గొప్ప ఆరంభంలాగా, జనవరి 2న హైదరాబాద్ లో,  జనవరి 3న నెల్లూరు లో, జనవరి 4న తిరుపతి లో, జనవరి 5న విశాఖ పట్నం కార్యక్రమాలలో సద్గురు మాట్లాడారు. .
‘సౌండ్స్ ఆఫ్ ఈశా’ వారు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి ఆరంభంలో ఓ చక్కటి "కబీరు" గీతాన్ని అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ డిజిపి శ్రీ అనురాగ్ శర్మ గారు , ‘హిమాలయ రహస్యాలు’ అనే ఓ కొత్త పుస్తకాన్ని, అలాగే ‘ యోగా టూల్స్ ఫ్రం సద్గురు’ అనే మొబైల్ యాప్‌ని ఆవిష్కరించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా సులువైన, శక్తివంతమైన "ఉపయోగా" ప్రక్రియను నేర్చుకోవచ్చు.

ఆ తర్వాత జరిగిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో,  సద్గురుని ప్రత్యక్షంగా ప్రశ్నలను అడిగే అవకాశం సత్సంగంలో పాల్గొన్న వారికి ఇవ్వబడింది. ఓ ప్రశ్నకు సమాధానంగా, ‘ వ్యక్తులను మంచి వారూ, చెడ్డవారూ అంటూ వర్గీకరించవలిసిన అవసరం లేదు...' అన్నారు.