నదుల రక్షణ ఉద్యమం: ఏడవ రోజు - బెంగళూరు
రాత్రి రాలీ ఆఫ్ రివర్స్ మైసూరు నుండి గార్డెన్ సిటీ బెంగుళూరుకు వచ్చింది...
ఉదయాన్నే బెంగళూరు బైకర్స్ ఉత్సాహవంతంగా సమావేశమయ్యారు..సద్గురు తమతో రైడ్ చేయడానికి సిద్ధమయ్యారని తెలిసి వారు ఎంతో ఆనందించారు..
ప్రొద్దునే జరిగిన కార్యక్రమం, సద్గరు బెంగుళూరు బైకర్స్ తో మోటారు సైకిల్ పై ఒక రౌండు వేశారు, ఆయనతో బైక్ మీద తిరగడం వారికెంతో ఆనందాన్ని ఇచ్చింది. దీనితో రాలీకి మరికొంతమంది ఉత్సాహవంతులైన మద్దత్తుదారులు చేరారు.
బెంగుళూరు రివర్ రాలీ లో పాల్గొంది...
బెంగుళూరులో ఎంత అద్భుతమైన స్పందన లభించింది! వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా సమావేశ ప్రాంగణాన్ని సన్నద్ధం చేసారు.
సమావేశ ప్రాంగణానికి వేలాది మంది మద్దతు తెలుపడానికి వచ్చారు. నదుల రక్షణ ఉద్యమంలో తమ వంతు బాధ్యతని నిర్వహించడానికి, సద్గురుకి అభినందనలు తెలియచేయడానికి ముందుకొచ్చారు..
మోత మోగించిన డోలు (డొల్లు కునిత) ప్రదర్శన తరువాత, వాసు దీక్షిత్, ఆయన బాండు ఉరకలెత్తించే పాటలతో, ప్రేక్షకులు కూడా కలసి వేదిక మీద సరైన వాతావరణం కల్పించారు.
అప్పుడు సద్గురు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక మీదకు వచ్చారు, అలుపెరగని ఉషా ఉతుప్ వేదికను తన అసలైన బాణిలో, తాను ఎప్పుడూ తెచ్చే ఉత్సాహంతో, ఉర్రూతలూగించింది. పునీత్ రాజ్ కుమార్, ఆమెతో కలసి ప్రజాదరణ పొందిన పాట, ‘ బొంమ్బె హేళు తైతే...నీనె రాజకుమార’ తన విఖ్యాత తండ్రి రాజ్కుమార్ ని జ్ఞాపకం చేసుకుంటూ పాడారు.
ఆ తరువాత చిత్రకారుడు విలాస్ నాయక్ స్పీడ్ పెయింటింగ్ లో తన ప్రతిభను చూపారు. ఆయన కరువు, విషాదంతోనున్న నది, సహాయం అర్థిస్తున్న చేతులను చిత్రించారు. ఆయన ప్రదర్శన అయిపోయింది అనుకుంటున్నప్పుడు. నది స్తుతి ప్రారంభం అయ్యింది, దానితో ఆ చిత్రం రూపు మారిపోయింది. చెట్లలో పచ్చదనం వచ్చింది, నది పెరగడం మొదలయ్యింది, నదీ తల్లి మందహాసం చేయడం మొదలిడింది, అర్థిస్తున్న చేతులు ధన్యవాదాలు తెలియజేసే చేతులుగా మారి పోయాయి, నది మళ్ళీ పారఢం మెదలు పెట్టింది.
అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నాటక ప్రభుత్వం ఈశా ఫౌండేషన్ తో MOU సంతకం చేసింది. షుమారు 25కోట్ల మొక్కలు నాటేందుకు ప్రతిపాదన జరిగింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, కేంద్ర మంత్రి సదానంద గౌడ, హీరో పునీత్ రాజ్ కుమార్ తదితరులు అందరిని ఉద్దేశించి ఈ కార్యక్రమం గురించి, దీని విశిష్టత గురించి చెబుతూ సద్గురు చేస్తున్న కార్యాన్ని కొనియాడారు. అందరూ ఈ ఉద్యమంలో భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు..
కార్యక్రమం ముగింపులో మన నదుల విశిష్టత గురించి, వీటిని కాపాడుకోవడానికి అన్ని పార్టీల వారూ ముందుకొచ్చి మద్దతు ఇచ్చారని, ఇది సకారాత్మకమైన అడుగు అని చెప్పారు.