నరాలకి బలాన్నిచ్చే బియ్యం పిండి మరియు నల్లబెల్లం సంకటి
పుట్నాలు, మెంతులు, శొంఠి, విడివిడిగా వేయించుకోవాలి (మాడకుండా).
కావాల్సిన పదార్థాలు:
బియ్యం పిండి - అరకేజి
పుట్నాలు - అరకేజి
మెంతులు - 50 గ్రా.
శొంఠి - 50 గ్రా.
చేసే విధానం:
పుట్నాలు, మెంతులు, శొంఠి, విడివిడిగా వేయించుకోవాలి (మాడకుండా).
- బియ్యం పిండి కలిపి మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. పిండి డబ్బాలో ఉంచుకోవాలి.
కావాల్సిన పదార్థాలు:
పైన చెప్పినట్లు తయారుచేసిన పిండి - 1 కప్పు
నల్లబెల్లం - 1 కప్పు
నీరు - 3 కప్పులు
మంచినూనె - సగం కప్పు
చేసే విధానం :
- పొయ్యిమీద నీరు పెట్టి నల్ల బెల్లం వేసి రెండు ఉడుకులు వచ్చాక వడకట్టాలి.
- వడకట్టిన నీరు మళ్ళీ మరిగించాలి.
- వేరే గిన్నెలో 4 టీస్పూనులు నూనె వేసి ఆడించిన పిండి 1 కప్పు కలుపుకోవాలి. ఆ తరువాత మరిగించిన బెల్లం నీటిలో కొంచెంగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు పొయ్యి సిమ్లో ఉంచు కోవాలి. ఆ తరువాత 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించి, తరువాత పొయ్యి ఆపుకోవాలి.
- ఆఖరున బెల్లం నీరు తేరు కుంటుంది.
- అది వడకట్టి పెట్టు కోవాలి. ముట్టుకుంటే చేతికి-అంటకుండా నూనె చేతికి పూసుకుని ఉండలు కట్టి, తినాలి.
- ఇది ఆడపిల్లలకి మంచిది. నరాలకి బలం.