కావాల్సిన పదార్థాలు:

బియ్యంపిండి -      2 కప్పులు

పులిసిన మజ్జిగ       -      1 కప్పు

ఉప్పు  -      తగినంత

మంచినూనె  -      తగినంత

పసుపు        -      సగం స్పూను        

తాలింపు      -      ఆవాలు, మినపప్పు, చల్లమిరపకాయ, లేక-ఎండుమిర్చి, కరివేపాకు

చేసే విధానం:

- బియ్యం పిండిలో మజ్జిగ ఉప్పు, పసుపు కొంచెం నీరు వేసి పలచగా కలపాలి. బాణలిలో తగినంత నూనె వేసి తాలింపు సామాన్లు వేసుకోవాలి. తరువాత కలుపుకున్న పిండి బాణలిలో గట్టి పడకుండా, అడుగంటకుండా కలుపుకోవాలి. కొద్దిగా-వెన్నముద్దలా ఉండగా దింపుకోవాలి.