కావాల్సిన పదార్థాలు :

అనాసపండు       -          1 కప్పు (చిన్న ముక్కలు)

జామపండు         -          1 కప్పు (గింజలు తీసినవి)

కీరదోసకాయ      -          1 కప్పు (పెచ్చుతీసి చిన్నముక్కలు చెయ్యాలి)

నల్లద్రాక్ష            -          1 కప్పు

ఫ్రూట్‌ బ్రెడ్‌ ముక్కలు  -   1 కప్పు

ఛాట్‌ మసాల      -          1 టీస్పూను

చేసే విధానం :

అనాస, జామ, కీరా గుండ్రంగా ముక్కలు చేసి పళ్లెంలో పెట్టుకోవాలి. ఫ్రూట్‌ బ్రెడ్‌ ఒవెన్‌లో పది నిమిషాలు ఉంచాలి. కావాలంటే నూనెలో వేయించి పక్కన పెట్టాలి. పళ్ళెంలో అన్నీ కలిపి, ఛాట్‌-మసాలా చల్లి అందరికీ వడ్డించాలి.