కావాల్సిన పదార్థాలు :

పనసపండు        -          1 కప్పు

కొబ్బరిపాలు        -          1 కప్పు

బెల్లం     -          1/4 కప్పు

జీడిపప్పు            -          1 టేబుల్‌ స్పూను (పొడిగా చేయాలి)

చేసే విధానం :

-          పనసపండు కొబ్బరిపాలు మెత్తగా అయ్యేలా మిక్సీలో - వెయ్యాలి. బెల్లం నీళ్ళలో కలిపి కరిగాక కొద్దిగా పాకం వచ్చేలా చేసుకుని దాన్ని మిక్సీలో తయారయిన పేస్టులో కలుపుకోవాలి. జీడిపప్పు తగినంత పైన వేసుకోవాలి. ఐస్‌ కావాలంటే వేసుకుని తాగొచ్చు.

-          పనసపండు తియ్యగా ఉంటుంది కాబట్టి - ఇష్టం లేనివారు బెల్లం మానెయవచ్చు. ఈ కూల్‌ షేక్‌ పిల్లలు చాలా ఇష్టపడతారు. దీంట్లో కొవ్వు లేనందువల్ల బి.పి.రాకుండా చేస్తుంది.

చదవండి: శరీరానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు