కావాల్సిన పదార్థాలు:

అతి మధురం      -     3 ఇంచ్‌ల ముక్క

శొంఠి    -          1 ఇంచ్‌ ముక్క

నీరు      -          200 మి.లీ

తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి  -  కావలసినంత

చేసే విధానం :

1 గ్లాసు నీరు మరిగించి శొంఠి, అతిమధురం దంచివేసి రెండు నిమిషాలు మరిగించి, వడకట్టి, తేనె లేక బెల్లం లేక కరపట్టి కలుపుకుని తాగాలి. ఇది దాహం తీరుస్తుంది. గొంతుపూత ఉన్నవారికి మంచిది. రొంపకు మంచిది.