అన్ని వయసులవారు త్రాగవలసిన బాదం ఖీర్
బాదం పప్పు వేడి నీటిలో నానపెట్టి తొక్కలు తీసి కొంచెం చల్లని పాలు పోసి మిక్సీలో వెయ్యాలి. ఆ తరవాత పాలు బాగా మరిగించాలి. అప్పుడు మిక్సీలో ఉన్న పేస్టు వేసి స్టౌమీద సిమ్లో ఉంచాలి.
కావాల్సిన పదార్థాలు:
బాదం పప్పు - 20
పాలు - 1 లీటరు
చక్కెర - 3/4 కప్పు
కుంకుమ పువ్వు - కొంచెం
సారపప్పు - 2 టీస్పూనులు (నేతిలో వేయించాలి)
చేసే విధానం : - బాదం పప్పు వేడి నీటిలో నానపెట్టి తొక్కలు తీసి కొంచెం చల్లని పాలు పోసి మిక్సీలో వెయ్యాలి. ఆ తరవాత పాలు బాగా మరిగించాలి. అప్పుడు మిక్సీలో ఉన్న పేస్టు వేసి స్టౌమీద సిమ్లో ఉంచాలి. ఆ తరువాత పంచదార కలియబెట్టి కరిగేదాకా వుంచాలి. గోరువెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు నానపెట్టాలి. అది కరిగాక బాదం ఖీర్లో కలపాలి. వేయించిన సారపప్పు పైన చల్లుకోవాలి. ఇది అన్ని వయసులవారు ఎల్లప్పుడూ తాగవచ్చు.