నదుల రక్షణ ఉద్యమం - 11వ రోజు : విజయవాడ
నదుల రక్షణ ఉద్యమ రధం నెల్లూరు గుండా ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టింది. పచ్చదనం కనిపిస్తూ "హరితాంధ్రప్రదేశ్" ని ప్రతిబింబిస్తోంది. కాని నీలి రంగు కనుమరుగైపోయింది. స్వర్ణముఖి నది లేదా మోఘలేరు ఎంతో పవిత్రమైన నది. ఇది తన దారిలో 5 శివాలయాలను కలుపుతుంది. నీటి గురించి చూస్తే ఇక్కడా అదే స్థితి. 2004-2005 సంవత్సరంలో చివరిసారిగా ఈ నది పారింది. అప్పటినుండి ఇది ఎండిపోయి ఉంది. పెన్నా నది కూడా నెల్లూరు నుండే బంగాళా ఖాతంలోకి ప్రవహిస్తుంది. కాని ఇప్పుడు ఇది కూడా 52% ఎండిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
నెల్లురులో సాయిబాబా సెంట్రల్ స్కూల్ 7-10వ తరగతి విద్యార్థులు సద్గురుకు ఆహ్వానం పలికారు..నదుల రక్షణకు తాము కూడా మద్దతు తెలుపుతున్నామని చెప్పారు...
అల్పాహారం కోసం సద్గురు నెల్లూరులో ఆగారు. నెల్లూరు వాసులు ఎంతో ఆనందంగా సద్గురుకు ఘన స్వాగతం పలికారు..
విజయవాడలోని కార్యక్రమం మొదలయ్యింది. ఉత్సాహంగా విజయవాడ వాసులు కార్యక్రమానికి తరలివచ్చారు. వివిధ వర్గాల నుండి ఇక్కడికి చేరిన వారు తమ సంపూర్ణ మద్దతు అందించారు.
సౌండ్స్ అఫ్ ఈశా సంగీతంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది..
సద్గురుకి స్వాగతం పలికేందుకు, నదుల రక్షణ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న కళాకారులు..
అనంతరం సద్గురు, ఆంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంత్రులు కార్యక్రమానికి చేరుకున్నారు..
సాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్ గారు అద్భుతమైన తమ కళని చూపించారు. మట్టితో భారత దేశ చిత్ర పటాన్ని, ఉదయిస్తున్న సూర్యుడిని, నదుల ప్రవాహాన్ని , గంగమ్మ తల్లి ఒడిలో సుభిక్షంగా ఉన్న అందమైన ఒకప్పటి భారతదేశాన్ని చూపించారు. ఆ తరువాత ఈ నాడు కన్నీరు పెడుతున్న గంగమ్మ తల్లి స్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ స్థితిని మార్చేందుకు ఇప్పుడు మనమందరం చేతులు కలిపి తిరిగి నదుల రక్షణ ఉద్యమానికి మద్దతు అందించాలని చిత్రంలో చూపించారు..
త్రీఒరి బ్యాండ్ వారు స్మితతో కలిసి "నది నది నది" అన్న పాటను ప్రదర్శించారు..
కామ్లిన్ వారు నిర్వహించిన నదుల రక్షణ పోటీల్లో గెలిచిన విద్యార్థులకి అవార్డు అందించారు...
ఇద్దరు చిన్నారులు సద్గురుని అభినందిస్తూ తమ భవిష్యత్తు కోసం ఆలోచించినందుకు, నదుల కోసం ఈ ఉద్యమం చేపట్టినందుకు సద్గురుని అభినందించారు..
వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్ సద్గురు చేపట్టిన నదుల రక్షణ ఉద్యమాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి హృదయపూర్వకంగా మద్దతు తెలుపుతున్నానని చెప్పారు.
తరువాత కేసినేని నాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు:
దేవినేని ఉమ సద్గురు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకి తీసుకెళ్తామని, ఇది మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు.
తరువాత సద్గురు తన మాత్రు భాష అయిన తెలుగు గురించి చెబుతూ, మన భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్క రూ ముందుకొచ్చి మద్దతు తెలపాలని చెప్పారు..
ముగింపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నుండి తాము ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని, దేశ సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ప్రతి కార్యానికి వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇచ్చారు..