నదుల రక్షణ ఉద్యమం: ఆరవ రోజు - మైసూరు
సాహసం చేయవలసిన చోటు
గోబి చెట్టిపాళ్యంలో కొంతసేపు ఆగిన తరువాత, మేము మైసూరు కు బయలుదేరాము, అప్పటికే వాన కురవడం మొదలయ్యింది. ఇక రాలీ కర్ణాటక లోకి ప్రవేశించింది.
Rain or shine, day or night, for #RallyForRivers, there is no respite! @ishafoundation @SadhguruJV pic.twitter.com/oFb0nERDM3
— Rally For Rivers (@rallyforrivers) September 7, 2017
బన్నేరు ఘట్ట రోడ్డులోని ధింమ్ భం ఘాట్ లో 27 హైర్ పిన్ బెండ్స్ న్నాయి, అక్కడ వాహనాలు మెల్లగా కదలాలి, ఇక అప్పుడే పొగమంచు కురవడం ప్రారంభమయ్యింది. పొగమంచు పట్టడం, అంతలోనే విడిపోవడం జరుగుతోంది, డ్రైవర్లకు రోడ్డు కనబడడం గగనమయ్యింది.
From the highways to the narrowest of roads. The rally is there. #RallyForRivers pic.twitter.com/6k9hU68IQ5
— Isha Foundation (@ishafoundation) September 7, 2017
అటువంటి పరిస్థితుల్లోనే మాకు ఏనుగులు కనబడ్డాయి. మొదట రోడ్డుకు ఎడమవైపు మూడు ఏనుగులు కలసి కనబడ్డాయి, ఒక అర కి.మీ దూరంలో ఇంకోటి తోక ఊపుకుంటూ రోడ్డు మీదకు వస్తున్నది. ఏనుగులను చూడగలగడం చాలా బాగుంది.
మైసూరు ఆకర్షణ
రివర్ రాలీ అందాల మైసూరు నగరానికి చేరుకుంది. సద్గురు పుట్టిన చోటు, ఆయనకు ఎంతో ఇష్టమైన సొంతవూరు. కుక్కరహల్లి చెరువు, నగరానికి ఆభరణం మధ్యలో పొదిగిన పచ్చలాగా, నగరానికి ఎంతో వన్నె తెచ్చింది. రోజు మొదలిడడానికి ఇది ఎంతో గొప్ప ఆరంభం, ఇక్కడి వారు చేసేపని కూడా రోజూ అదే. ప్రఖ్యాత కన్నడ కవి కువెంపుకు కూడా ఇదే ఆటవిడుపు.
సద్గురు ఈ చెరువులో బగిణ పూజ చేసారు..
గ్రూపు ఇప్పుడు మీనాక్షిపురం వైపు వెళుతోంది, అక్కడకు కావేరి, లక్ష్మణ తీర్థం, హేమవతి, మూడు నదుల సంగమం చాలా దగ్గర. అక్కడ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన చెరో 50 మంది రైతులు కలసి సమావేశమయ్యారు. సద్గురు తమ గురించి అలోచించి నీటిని, భూమిని కాపాడేందుకు చేసే అవగాహన ఉద్యమానికి సంపూర్ణ మద్దతుని తెలుపుతున్నామని రైతులు తెలిపారు.
చివరిగా మైసూరు నగరానికి చేరింది ఉద్యమ రధం..
ఉత్సాహంతో నదుల రక్షణ ఉద్యమానికి ప్రజలు,కళాకారులు స్వాగతం పలికారు:
షుమారు 5ఎకరాల కన్నా ఎక్కువ చెట్లను సాలుమరద తిమ్మక్క గారు నాటారు. 106ఏళ్ల వయసు గల ఈ పర్యావరణవేత్తను సద్గురు సాదరంగా ఆహ్వానించారు..
ధర్మస్థల మంజునాథ దేవాలయ ధర్మాధికారి, కన్నడ హీరో గణేష్, మైసూరు రాజమాత, ఇంకా ప్రముఖులు సద్గురు చేపట్టిన నదుల రక్షణ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేసారు.
అనంతరం సద్గురు ప్రసగించి మన నదుల గురించి, రైతుల దుస్థితి గురించి, మన చేయవలసిన తక్షణ కర్తవ్యాల గురించి అందరితో చెప్పారు.