నదుల రక్షణ ఉద్యమం: నాల్గవ రోజు - తిరుచిరాపల్లి
తిరుచిరాపల్లికి స్వాగతం
నదుల రక్షణ ఉద్యమ రధం నిన్న రాత్రి పొద్దుపోయాక తిరుచ్చి వచ్చింది. రాత్రి కురిసిన పెద్ద వాన మూలంగా కావేరీ నది ఒడ్డున ఉన్న వేదికా స్థలం చాలా బురదగా తయారయ్యింది. దానిని పట్టించుకోకుండా ప్రజలు ఉత్సాహంగా గుమికూడి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
వేదిక మీద ముఖ్య అతిథులు
వేదిక ప్రముఖులతో కళ కళ లాడింది. అందులో ఇద్దరు నిపుణులు ఉన్నారు, వారు నమ్మళ్వార్ ఎకొలాజికల్ ఫౌండేషన్ కు చెందిన అంగల్స్ రాజా, ఎంటమాలజిస్ట్ పూచి నీ సెల్వం. ఇంకా అనేక వ్యవసాయదారుల సంఘాలనుంచి ప్రతినిధులు ఉన్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజీకి చెందిన రె.ఫ్రా.లియో ఫెర్నాండో, విశ్రాంత CBI డైరెక్టర్ డా.కార్తికేయన్ ఉన్నారు.
అంతరించి పోతున్న నదుల గురించి సద్గురు వివరించారు, ఇంకా తాను ఇలా రాలీ ఎందుకు నిర్వహిస్తున్నారో తెలియజేసారు. తాము ప్రతిపాదించబోయే పాలసీ ప్రతిపాదనలలో ఇంకా చాలా సంక్లిష్ట సమస్యలున్నాయని, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు దీనిని పరిశీలిస్తున్నారు అని చెప్పారు.
సమావేశానికి వచ్చిన ప్రజలు, తాము ఈ ఉద్యమానికై కృషి కొనసాగిస్తామని, తమిళ ప్రజలందరూ 80009 80009 కు మిస్ కాల్ ఇచ్చేలా చూస్తామని చెప్పారు.