నమస్కారం!

గోదావరి పుష్కరాల సందర్భంగా జులై 23న రాజమండ్రిలో సద్గురు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కుర్చీలు పరిమితం  కావున, మొదట వచ్చిన వారికి మొదటి ప్రాముఖ్యత.

12 నదీ తీర ప్రాంతాలలోని పుణ్యస్ధలాలలో జరుపుకునే భారతీయ పండుగలే పుష్కరాలు.  పుష్కరాలలో లక్షలాదిగా ప్రజలు పవిత్రనదులలో స్నానం ఆచరించి దేవాలయాలను సందర్శిస్తారు. ఈ సంవత్సరం, ఈ పండుగ జులై 14 నుండి 25వ తారీఖు వరకు ఆంద్రప్రదేశ్, తెలంగాణలలో వివిధ గోదావరి నదీ తీర ప్రాంతాలలో జరుపబడుతుంది.

 వేదిక: గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ , రాజమండ్రి.
 సమయం: సాయంత్రం 3-5గం
 వివరాలకు: 9885582378.